న్యూస్ డెస్క్, హైదరాబాద్ :
స్మార్ట్ ఫోను లేనందున సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమతి నిరాకరించిన సంఘటన ఉదయం హైటెక్ సిటీలో వెలుగు చూసింది. హైటెక్ సిటీ లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సురేష్ అనే వ్యక్తికీ ఎదురైనా చేదు సంఘటన ఇది. రోజుటి లానే ఇవాళ కూడా ఆఫీసుకి వెళ్ళాడు. సెక్యురిటీ, ఐ. డి. కార్డు అడిగాడు. అది చూపించిన తర్వాత, సెల్ ఫోను తీసి చూపించమని అన్నాడు. సురేష్ ఒక పాత పాకియా ఫోను చూపించటంతో, సాఫ్ట్ వేర్ సభా హక్కుల ఉల్లంఘన క్రింద అతనికి అనుమతిని నిరాకరించారు.
దీని పైన సెక్యూరిటీ జనాలని మన ప్రతినిధి సంప్రదించగా, ఇలా స్పందించాడు:
"కుక్క అన్నాక తోక, పక్షి అన్నాక రెక్క ఉండాలి. అలానే సాఫ్ట్ వేర్ అన్నాక స్మార్ట్ ఫోను ఉండాలి. మాకు పై నుండి ఉత్తర్వులు వచ్చాయి. ఎట్టి పరిస్థితులలో స్మార్ట్ ఫోను లేనిదే లోనికి అనుమతించం. ఐ. డి. కార్డు లేకపోయినా పర్వాలేదు కానీ స్మార్ట్ ఫోను మాత్రం ఉండి తీరాల్సిందే." అని తేల్చి చెప్పారు.
ఈ విషయం మీద సురేష్ ను ప్రశ్నించగా, "స్మార్ట్ ఫోను లేకుండా రానివ్వరని నాకు కూడా తెలుసు. రాత్రి, నా నలభై వేల ఫోను నీళ్ళల్లో పడిపోయింది. బాగు చేయటానికి ఇస్తే, షాపు వాడు, అది బాగు అయ్యే దాక వాడుకోమని, తన దగ్గర ఉన్న పాత పాకియా ఫోను ఒకటి ఇచ్చాడు. నాకు సొంతంగా ఒక స్మార్ట్ ఫోను ఉందని చెప్పినా వీళ్ళు వినటం లేదని" ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇట్లు ....
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
No comments:
Post a Comment