Friday, July 25, 2014

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు అమ్మాయికి జరిమానా

న్యూస్ డెస్క్, హైదరాబాద్ :

ముఖాన స్కార్ఫ్ లేకుండా బండి ఎక్కినందుకు, ఒక అమ్మాయికి 5000 జరిమానా వేసిన సంగతి హైదరాబాదులో చోటు చేసుకుంది. మాదాపూర్ లోని ఒక ఐటి కంపెనీలో పని చేస్తున్న దీపక్, తన స్నేహితురాలు సరోజతో కలిసి, బంజారా హిల్స్ లోని సినీ మాక్స్  సినిమా థియేటర్ లో "సగం కాలిన శవం" అనే దయ్యం సినిమాకి వెళ్ళాలని బయలు దేరాడు.  

మాదాపూర్ నుండి వస్తూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దాటగానే, పోలీసులు వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. దీపక్ ను సైతం ఆపారు. 


దీపక్ తన బండిని పక్కకు ఆపి, హెల్మెట్ తీసి, తన జేబులో ఉన్న బండి సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ తీసి పోలీసు చేతికి అందించాడు. ట్రాఫిక్ కానిష్టేబుల్ వాటిని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాడు. 5000 రూపాయలు జరిమానా విదిస్తూ చలానా రాసి దీపక్ చేతికి ఇచ్చాడు. ఖంగు తిన్న దీపక్ తేరుకొని, "నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, హెల్మెట్ తో సహా,  5000 రూపాయలు ఎందుకు" అని ప్రశ్నించాడు. దీపక్ వెనుక కూర్చున్న సరోజ ముఖాన స్కార్ఫ్ లేనందుకు ఆ 5000 జరిమానా విదిస్తున్నట్టు తెలియజేశాడు. చేసేది లేక 5000 కట్టి అక్కడి నుండి వెళ్ళి పోయాడు. 

కాబట్టి ప్రజలు గమనించ వలసిందిగా కోరటమైనది   

ఇట్లు .... 
బుల్లబ్బాయ్, ఎడిటర్ ,
గాలిNEWS

Follow us on Facebook @ galiNEWS

No comments:

Post a Comment